డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు ..కరణ్ జోహార్
By: Sankar Sat, 26 Sept 2020 2:27 PM
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తనపై వైరల్ అవుతున్న విమర్శలకు మరోసారి వివరణ ఇచ్చారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్. 2019 నవంబర్లో జరిగిన పార్టీకి, డ్రగ్స్కు తనకు ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని కొట్టిపారేశారు.
ఈ పార్టీలో ఎవరూ ఎలాంటి డ్రగ్స్ తీసకోలేదని చెప్పుకొచ్చారు. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయంటు వస్తున్న ఆరోపణలు తనను, తన ఫ్యామిలీని బాధిస్తున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్షితిజ్ప్రసాద్, అనుభవ్ చోప్రాతో తనకు వ్యక్తిగత సంబంధాలేవి లేవని చెప్పారు. వీరిద్దరూ ధర్మా ప్రొడక్షన్లో ఉద్యోగులు కూడా కాదని చెప్పారు.
అనుభవ్ చోప్రా కేవలం రెండు నెలల పాటు ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారన్నారు. డ్రగ్స్ లింకులకు, 2019 నవంబర్లో జరిగిన పార్టీయే సెంటర్పాయింట్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు కరణ్జోహర్. అయితే ఈ రోజు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు దీపికా పదుకొనే హాజరు అయ్యింది.