Advertisement

  • కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రాక్షసిగా మారింది

కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రాక్షసిగా మారింది

By: chandrasekar Tue, 18 Aug 2020 00:09 AM

కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే రాక్షసిగా మారింది


భర్తను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఆమె ఐదుగురు బిడ్డలను చిత్రహింసలు పెడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలో వెలుగుచూసింది.

తంబుగానిపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తితో కొన్నేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం. అయితే భర్తను వదిలేసిన ఆమె మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే నాలుగు నెలల క్రితం కరోనా వైరస్ సోకడంతో తంబుగానిపల్లెకు వచ్చేసింది.

ఈ క్రమంలోనే తన ఐదుగురు బిడ్డలను కొద్దిరోజులుగా కట్టేసి తీవ్రంగా హింస పెడుతోంది. పిల్లలు ఇంట్లో నుంచి గట్టిగా కేకలు వేస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఆరా తీయగా ఆమె పైశాచికం బయట పడింది.

దీంతో స్థానికులు గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం రాత్రి మరోసారి పిల్లలను వేధించడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి గ్రామానికి చెందిన ఆరా తీశారు. పిల్లలను రక్షించడంతో పాటు వారిని హింసించిన తల్లిపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Advertisement