కన్నడ నటీమణులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదీలకు మళ్ళీ బెయిల్ నిరాకరణ
By: chandrasekar Wed, 04 Nov 2020 12:29 PM
డ్రగ్స్ కేసులో కన్నడ
నటీమణులు సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదీలకు మళ్ళీ బెయిల్ నిరాకరించబడింది.
శాండిల్వుడ్ డ్రగ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవిస్తోన్న కన్నడ నటీమణులు
సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదీలకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదరైంది.
వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ డ్రగ్ కేసులో
రాగిణి, సంజనతో
పాటు మరో 12 మంది అరెస్టయ్యారు. వీరంతా గత నెలన్నర రోజులుగా
జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. రాగిణి, సంజన ఇప్పటికే బెయిల్ కోసం పిటిషన్ చేసుకోగా ప్రత్యేక
కోర్టు అందుకు నిరాకరించింది. ఇప్పుడు మరోసారి వీరి బెయిల్ పిటిషన్ను హైకోర్టు
కొట్టివేసింది. సంజన, రాగిణి అక్టోబర్లో రెండోసారి బెయిల్ పిటిషన్
చేసుకోగా అది మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
సంజనా మరియు రాగిణి
పిటిషన్ను విచారించిన ధర్మాసనం బెయిల్ మంజూరుకు నిరాకరించింది. అందువల్ల రాగిణిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
కస్టడీలోకి తీసుకోగా సెప్టెంబర్ 14 నుంచి ఆమె జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక సంజన
సెప్టెంబర్ 16 నుంచి జుడిషయల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఇద్దరు పరప్పన
అగ్రహారలోని సెంట్రల్ జైలులో ప్రస్తుతం
ఉన్నారు. వీరితో పాటు మిగిలిన నిందితులంతా గతంలో స్పెషల్ ఎన్డీపీఎస్
కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ సెప్టెంబర్ 28న రాగా
కోర్టు తిరస్కరించింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున బెయిల్ మంజూరు చేయడం
కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని
వ్యక్తం చేయడంతో వీరికి బెయిల్ దొరకలేదు. దీంతో వీరు ఇరువురు తీవ్ర నిరాశకు
లోనయ్యారు.