కంగనా రనౌత్పై ట్విట్టర్లో మండిపడ్డ కన్నడ నటి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్య
By: chandrasekar Sat, 19 Sept 2020 09:36 AM
కంగనా రనౌత్పై ట్విట్టర్లో
కన్నడ నటి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్య మండిపడ్డారు. ప్రస్తుతం సంచలన
వ్యాఖ్యలకు కేంద్రబిందువుగా మారిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై శాండల్వుడ్లో
ఒకప్పటి హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రమ్య మండిపడ్డారు. ఇటీవల
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా కంగానాకు వ్యతిరేకంగా ట్విట్టర్లో
పోస్ట్పెట్టారు. బాలీవుడ్లో డ్రగ్స్ వాడకం పెరిగిందంటూ కంగనా గగ్గోలు
పెడుతుండటంపై రమ్య విమర్శలు గుప్పించారు. పబ్లిసిటీ కోసం అనవసర రాద్దాంతం
చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కంగనాకు ఒక సలహా
కూడా ఇచ్చారు. 'డ్రగ్స్ కారణంగా కలిగే నష్టం గురించి సమాజానికి
ఏదైనా సందేశం ఇవ్వండి. ఓ వీడియోలో డ్రగ్స్కు బానిసగా మారానని పేర్కొన్నారు కదా, అదేవిధంగా
మీకు నిజంగా ధైర్యం ఉంటే డ్రగ్స్కు
వ్యతిరేకంగా పోరాటం చేయండి.
ఇంతకుముందు డ్రగ్స్
వాడిన చేదు అనుభవాల నుంచి ఎలా బయటకు వచ్చారో ప్రజలకు వివరించండి. తద్వారా డ్రగ్స్ వాడకం ఎంత
ప్రమాదమో సమాజంలో చైతన్యం కలిగించిన వారవుతారు' అని తెలిపింది. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయదత్ ఇప్పటికే
అలాంటి పనిచేశారని రమ్య పేర్కొన్నారు. దీపికాపదుకునే మానసిక అనారోగ్యంతో
బాధపడేవారి కోసం పనిచేస్తున్నారని, ఓ సంస్థను దత్తత తీసుకుని లక్షలాది మందికి చేయూత
అందిస్తున్నారని కంగనాకు గుర్తుచేశారు. 'డ్రగ్స్కు వ్యతిరేకంగా మీరు ఏమైనా చేయదలచుకుంటే
దీపికాను చూసి నేర్చుకోండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. మీ దగ్గరున్న
సాక్ష్యాలను వారికి ఇవ్వండి. దాంతో జాతీయ డ్రగ్స్ నియంత్రణ దళానికి సాయం
చేసినవారవుతారు అని రమ్య సూచించారు. ఆనతికాలంగా పలు డ్రగ్స్ కేసులు ఇటు కన్నడ
సినీ ఫీల్డ్ లో అటు బాలీవుడ్ లో బయటపడ్డ విషయం తెలిసిందే.