కన్న కొడుకును బలి తీసుకున్న తల్లి వివాహేతర సంబంధం
By: chandrasekar Thu, 08 Oct 2020 5:34 PM
వివాహేతర సంబంధం కారణంగా
ఓ తల్లి కన్న కొడుకును బలి తీసుకున్నది.
తాగిన మత్తులో ప్రియుడు చిన్నారిపై దాడి చేయగా ప్రాణాలు ఆ చిన్నారి
ప్రాణాలు వదిలాడు. శవాన్ని మార్గమధ్యంలో పూడ్చిపెట్టి ఇంటికి వెళ్లి పోయారు. ఈ దారుణ
ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం
వరంగల్ జిల్లాకు చెందిన సంపంగి శ్రీనివాస్కు, ఖమ్మం జిల్లా మంచుకొండకు చెందిన గుగులోతు ఉషా మధ్య
వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఉషా తన ఇద్దరు కుమారులు సుకుమార్, అంకిత్
(ఏడాదిన్నర) లతోపాటు శ్రీనివాస్తో కలిసి కృష్ణాజిల్లా చిల్లకల్లు మండలం
అనుమంచిపల్లిలో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.
ఆదివారం శ్రీనివాస్
మద్యం మత్తులో అంకిత్ను కొట్టగా కోమాలోకి పోవడంతో చికిత్సకోసం కోదాడ హాస్పిటల్ కు
తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందడంతో కోదాడ బైపాస్ నుంచి హుజూర్నగర్
వైపుగా చిలుకూరు సమీపంలోని అక్షర పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లే దారిలో రాత్రి పూట
మృతదేహాన్ని పూడ్చి ఇంటికి వెళ్లారు.
ఇంటి యజమాని అంకిత్
విషయమై నిలదీయగా కోదాడ హాస్పిటల్లో ఉన్నాడని తెలిపారు. అను మానంతో యజమాని గట్టిగా
అడగడంతో సోమవారం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పారిపోయారు. దీంతో యజమాని
స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్నంబర్ ఆధారంగా శ్రీనివాస్ను పట్టుకుని
విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది.