గ్రేటర్ ఎన్నికలపై కాంగ్రెస్ కు చురకలు అంటించిన కంగనా రనౌత్
By: Sankar Fri, 04 Dec 2020 7:26 PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు 40 స్థానాలు గెలిచింది.
కాగా కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కంగనా కాంగ్రెస్ పార్టీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ మాత్రం తన పాలనతో క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అంటూ కంగనా కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు..
Tags :
tweet |
ghmc |
slams |