అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్న కంగనా రనౌత్
By: Sankar Sun, 11 Oct 2020 2:40 PM
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వాటిలో ఇప్పుడు అందరి దృష్టి కంగన రనౌత్ నటిస్తున్న'తలైవి'పైనే. 2019 నవంబర్లో 'తలైవి' ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది.
ఈ సినిమాలో ఎంజీఆర్గా అరవిందస్వామి నటిస్తున్నారు. ఇక కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాపైన చాలా అంచనాలున్నాయి. అయితే కరోనా వలన వాయిదా పడిన ఈ సినిమా మరో షెడ్యూల్ మొదలై పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని కంగనా తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. "విప్లవాత్మకమైన నాయకురాలి సినిమా మరో షెడ్యూల్ పూర్తి చేశాం.
కరోనా తర్వాత చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి కానీ యాక్షన్కు, కట్ కు మధ్య చేసే నటన మాత్రం మారలేదు. తలైవి చిత్ర బృందానికి కృతజ్ఞతలు" అని కంగనా వెల్లడించింది. అంతేకాదు తాజాగా జయలలిత అసెంబ్లీ సన్నివేశాలన చిత్రీకరించారు. వాటికి సంబంధించిన ఫోటోలను కంగనా సోషల్ మీడియాలో షేర్ చేసింది.