Advertisement

కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్

By: chandrasekar Thu, 27 Aug 2020 10:14 AM

కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ డెత్ కేసులో డ్రగ్ కోణం ఉందేమోనని అనుమానిస్తోంది. అందుకే ఈ కేసులో జోక్యం చేసుకోవాల్సిందిగా నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో (ఎన్‌సీబీ)ని ఈడీ కోరింది. ఈ విషయంపై హిందీ పాపులర్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎన్‌సీబీ దర్యాప్తు మొదలుపెడితే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది టాప్‌ స్టార్స్ జైళ్లలోకి వెళ్లాల్సి వస్తుందని షాకింగ్ కామెంట్ చేసింది.

కొన్ని ఫిల్మ్ పార్టీల్లో డ్రగ్ వరల్డ్‌, ఆ మాఫియా విషయాలు తన దృష్టికి వచ్చాయని తెలిపింది. ఒకవేళ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ లో ఎంటరైతే అనేక మంది ఏ–లిస్టర్స్ జైళ్లలోకి వెళ్లాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్టులు నిర్వహిస్తే షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా బాలీవుడ్‌ లోని చెత్తను ప్రధాన మంత్రి కార్యాలయం శుభ్రం చేస్తుందని ఆశిస్తున్నా’ అని కంగనా ట్వీట్ చేసింది.

Tags :
|

Advertisement