Advertisement

  • అమెరికా కొత్త అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా

అమెరికా కొత్త అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా

By: Sankar Mon, 09 Nov 2020 2:30 PM

అమెరికా కొత్త అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా

ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రముఖులపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటి వరకు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేను టార్గెట్ చేస్తూ‌ వరుస కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత బాలీవుడ్‌ గేయ రచయిత జావేద్‌ అక్తర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆమె పరువు నష్టం దావా కేసును ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో తాజాగా ఆగ్రరాజ్యం కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌పై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను ఓ గజినీగా పేర్కొంటూ సోమవారం ట్వీట్‌ చేశారు.

‘మొత్తం షోను కమల హ్యారిస్‌ నడిపిస్తారు. ప్రతి అయిదు నిమిషాలకు ఒకసారి డేటా క్రాష్‌ అయిపోయే గజినీ జో బైడెన్‌. ఆయనకు ఇంజెక్ట్‌ చేసిన మందుల వల్ల ఏడాదికి మించి ఉండరు. ఇక షో మొత్తాన్ని కమలా హ్యారిష్‌ నడిపించడం ఖాయం’ అంటూ కంగనా ట్వీట్‌ చేశారు

Tags :

Advertisement