శివసేన పార్టీపై మళ్ళీ ట్వీట్ చేసిన కంగనా రనౌత్
By: chandrasekar Mon, 26 Oct 2020 5:11 PM
కంగనా రనౌత్ ఏ మాత్రం
సంకోచించకుండా మళ్ళీ శివ సేన పై ట్వీట్ చేసి చాటుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, మహారాష్ట్రలో
అధికారపక్షం శివసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయదశమి రోజున శివసేన
పార్టీని కంగనా మరోసారి టార్గెట్ చేశారు. పాక్షికంగా కూల్చేసిన ముంబైలోని కంగనా
రనౌత్ కార్యాలయాలన్ని విజయదశమి సందర్భంగా పుష్పాలతో అలంకరించారు. ఆ ఫోటోను ట్వీట్
చేసిన కంగనా తన ఫ్యాన్స్కు విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా
మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్పై విరుచుకపడ్డారు.
పప్పు సేన తన ఇంటిని కూల్చేయగలదేమో కానీ తన స్పిరిట్ను కూల్చేయలేరని
పేర్కొన్నారు. చెడుపై మంచి విజయాన్ని బంగ్లా నెంబర్.5 (కంగనా
ఆఫీస్ భవంతి) సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
అనతి కాలంగా కంగనా రనౌత్
కు మరియు శివసేన పార్టీకి రగులుతున్న వైరంలో భాగంగా కంగనా ట్వీట్ చేసింది.
శివసేనను టార్గెట్ చేస్తూ కంగనా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యింది.
శివసేనను ఎదుర్కొనే విషయంలో కంగనా ప్రదర్శిస్తున్న ధైర్యాన్ని ఆమె ఫ్యాన్స్
మెచ్చుకుంటున్నారు. అటు సోషల్ మీడియాలో సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ కూడా కంగనాకు
బాసటగా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ కేసులో ముంబై
పోలీసులు, శివసేన
నేతలను కంగనా రనౌత్ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. సుశాంత్ మరణానికి కారణమైన అతని
గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె
ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కంగనా, శివసేన నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.