Advertisement

  • మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై విరుచుకు పడ్డ కంగనా రనౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై విరుచుకు పడ్డ కంగనా రనౌత్

By: chandrasekar Thu, 10 Sept 2020 09:25 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై విరుచుకు పడ్డ కంగనా రనౌత్


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పై కంగనా రనౌత్ విరుచుకు పడ్డారు. ఆమె భవనాన్ని కూల్చడంతో ఉద్వేగానికి గురయ్యారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఈసారి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికే సవాల్ విసిరింది. నీ అహంకారం నేలమట్టమవుతుందంటూ ఏకవచనంలో బెదిరించింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి వివాదాస్పదంగా సంచలనంగా మారిన కంగనా రనౌత్ ఇప్పుడు మరోసారి విరుచుకుపడింది. ముంబైలోని ఆమె ఇంటిని ధ్వంసం చేసిన వ్యవహారంలో ఆమె స్పందించింది.

కంగనా రనౌత్ ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ను ఏకవచనంతో సంభోధిస్తూ సవాల్ విసిరింది. ఇవాళ నా ఇళ్లు ధ్వంసమైంది రేపు నీ అహంకారం నేలమట్టమవుతుందంటూ ఛాలెంజ్ చేసి సంచలనం సృష్టించింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 'ఉద్ధవ్ ధాకరే నీవేమనుకుంటున్నావ్! సినీ మాఫియాతో కలిసి నా ఇళ్లు పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నాననుకుంటున్నావా! ఇవాళ నా ఇళ్లు ధ్వంసమైంది. రేపు నీ అహంకారం నేలమట్టమవుతుంది. ఇది కాలానుగుణంగా జరిగేదే గుర్తుంచుకో, కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.

ఇందుకుగాను ఆమె మాట్లాడుతూ, నా పై ఓ విధంగా నీవు మంచే చేశావనిపిస్తోంది. ఎందుకంటే నాకు తెలుసు కశ్మీరీ పండిట్లపై ఏం జరిగిందో. ఇవాళ నాకు అనుభవమైంది. నేను దేశానికి మాట ఇస్తున్నా నేను అయోధ్యపైనే కాదు కాశ్మీర్ పై కూడా ఓ సినిమా తీస్తాను. నా దేశ ప్రజల్ని చైతన్యపరుస్తాను. ఎందుకంటే నాపై ఏం జరిగినా జరుగుతుంది. దీనివెనుక వేరే కారణాలున్నాయి. వేరే ఉద్దేశ్యాలున్నాయి. ఉద్ధవ్ ధాకరే ఈ క్రూరత్వం ఈ అరాచకం ఏదైతే ఉందో నా పై జరగడం మంచికే అయింది అని తెలిపింది.

Tags :
|

Advertisement