Advertisement

  • ట్విట్టర్ వేదికగా జయబచ్చన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా రనౌత్

ట్విట్టర్ వేదికగా జయబచ్చన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా రనౌత్

By: chandrasekar Wed, 16 Sept 2020 5:18 PM

ట్విట్టర్ వేదికగా జయబచ్చన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కంగనా రనౌత్


పార్లమెంట్‌లో నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్ 'బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందంటూ చేసిన కామెంట్స్‌పై అమితాబ్ సతీమణి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే బాలీవుడ్‌ను అవమానించేలా మాట్లాడుతున్నారంటూ ఆమె రవికిషన్, కంగనాను పరోక్షంగా ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా జయబచ్చన్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు బాలీవుడ్ క్విన్ ఈ విధంగా ట్విట్ చేసింది. జయా జీ.. నా స్థానంలో మీ కూతురు శ్వేత ఉంటే ఇలాగే మాట్లాడతారా.. శ్వేతపై దాడి జరిగినా.. టీనేజ్‌లో డ్రగ్స్‌కు బానిసైనా.. లైంగిక వేధింపులకు గురైనా ఇలానే స్పందిస్తారా..? ఇండస్ట్రీలో వేధిస్తున్నారని అభిషేక్ బచ్చన్ చెబితే ఇలాగే మాట్లాడేవారా? అభిషేక్ ఇంట్లో ఉరేసుకుంటే.. ఇలానే స్పందిస్తారా..? అంటూ కంగనా ట్వీట్ చేసింది.

కానీ.. నిన్న లోక్‌సభలో ప్రసంగించిన బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్ బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా గురించి పలు వ్యాఖ్యలు చేశారు. పక్కదేశాల నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను దేశంలోకి తీసుకొస్తున్నారని, చిత్రపరిశ్రమల్లోని చాలా మంది నటీనటులు బానిసయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ క్రమంలో మంగళవారం రాజ్యసభలో జయబచ్చన్ బాలీవుడ్‌ను అవమానిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒకరిద్దరు చేసిన తప్పులకు అందరినీ నిందించడం సరైనది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ జయబచ్చన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ ట్విట్ చేసింది.

Tags :

Advertisement