Advertisement

  • శివసేన ప్రభుత్వంపై ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్న కంగనా

శివసేన ప్రభుత్వంపై ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్న కంగనా

By: chandrasekar Fri, 18 Sept 2020 7:11 PM

శివసేన ప్రభుత్వంపై ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తూనే ఉన్న కంగనా


ముంబై నగరాన్ని వదిలి వెళ్లిపోయిన నటి కంగనా రనౌత్ శివసేన ప్రభుత్వంపై ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. తాజాగా కంగనా మహారాష్ట్ర ప్రభుత్వంపై తన ట్వీట్లలో తీవ్ర విమర్శలు చేసింది.

మహారాష్ట్ర ఈ కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం అని, రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంటే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోవడం మానేసి వారికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని వేధించడమే పనిగా పెట్టుకుందని కంగనా ట్వీట్ చేసింది.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేయడమే కాకుండా ఫెమినిస్టులపై కూడా కంగనా మండిపడింది. ఫెమినిస్టులంతా ఎలాంటి ఆధారాలు లేకుండా తన ఇంటిని అక్రమ కట్టడమని అంటున్నారని, తాను ఈ కేసులో బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై గెలుస్తానని, బీఎంసీ నష్టపరిహారం చెల్లించక తప్పదని కంగనా విశ్వాసం వ్యక్తం చేసింది. అప్పుడు ఈ ఫెమినిస్టులంతా తనకు క్షమాపణ చెబుతారా అని కంగనా ప్రశ్నించింది.

Tags :

Advertisement