రెండో టెస్టుకు కేన్ విలియ్సమన్ దూరం...
By: chandrasekar Fri, 11 Dec 2020 11:20 PM
టీమిండియా కెప్టెన్
విరాట్ కోహ్లీ బాటలో న్యూజిలాండ్ సారథి కేన్ విలియ్సమన్ వెస్టిండీస్తో
ఆడాల్సిన రెండో టెస్టుకు దూరం అయ్యాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ జనవరిలో తల్లి
కాబోతున్న సందర్భంగా అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి తొలి టెస్టు ఆడడం లేదు. అదే
కారణంతో విలియమ్సన్ వెస్టిండీస్తో ఆడాల్సిన రెండో టెస్టుకు దూరం అయ్యాడు.
కేన్ విలియమ్సన్ సతీమణి
సారా రహీమ్ కొద్దిరోజుల్లో తొలిసారి మాతృత్వపు మాధుర్యాన్ని పొందుతుందని, ఈ
నేపథ్యంలో డిసెంబర్ 11 నుంచి వెస్టిండీస్తో జరిగే రెండో టెస్టులో అతడు
ఆడటం లేదని కోచ్ గ్యారీ స్టెడ్ పేర్కొన్నాడు. అతడి స్థానంలో ఇటీవలే అరంగేట్రం
చేసిన విల్ యంగ్ ఆడతాడని చెప్పాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ 911
పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా కోహ్లీ, విలియమ్సన్ 886 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఈరోజు ప్రారంభం
అయిన రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ ఆడట్లేదు. అతని స్థానంలో విల్ యంగ్
ఆడుతున్నాడు. ఈ టెస్టులో యంగ్ రాణించాడు. 87 బంతుల్లో 43 రన్స్ చేశాడు. నాలుగు బౌండరీలు బాదాడు.