- హోమ్›
- వార్తలు›
- మన విషాదాలను ట్రంప్ రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్నాడు.. ట్రంప్ పై ఫైర్ అయిన కమలా హారిస్
మన విషాదాలను ట్రంప్ రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్నాడు.. ట్రంప్ పై ఫైర్ అయిన కమలా హారిస్
By: Sankar Thu, 20 Aug 2020 1:23 PM
అమెరికా డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని కమలా హారిస్ బుధవారం అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆమె కన్వెన్షన్ను ఉద్దేశించి మాట్లాడారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్పై ఫైర్ అయ్యారు. మన విషాదాలను ట్రంప్ రాజకీయ అస్త్రాలుగా మార్చుకుంటున్నారని ఆమె విమర్శించారు.
రాబోయే దేశాధ్యక్ష ఎన్నికల్లో జోసెఫ్ బైడెన్కు ఓటు వేయాలని ఆమె అమెరికన్లను కోరారు. బైడెన్ దేశాధ్యక్షుడు అయితే.. దేశ ప్రజలందరినీ ఆయన ఒక్కటి చేస్తారన్నారు. ట్రంప్ నాయకత్వ వైఫల్యం.. ప్రజల ప్రాణాలను, జీవితాలను ప్రమాదంలో నెట్టేసిందన్నారు.
నవంబర్ 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే బుధవారం జరిగిన సమావేశంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మాట్లాడారు. ట్రంప్ పాలనా విధానాన్ని ఖండించిన ఆయన.. బైడెన్కు ఓటెయ్యాలన్నారు.శ్వేతసౌధ ఉద్యోగాన్ని ట్రంప్ సీరియస్గా చేస్తారనుకున్నాం, కానీ ఆయన పాలన నిర్లక్ష్యంగా ఉన్నట్లు బరాక్ ఒబామా విమర్శించారు. ట్రంప్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమెరికా ప్రతిష్టకు భంగం కలిగిందని, మన ప్రజాస్వామ్య సంస్థలకు ప్రమాదం ఏర్పడిందని ఒబామా అన్నారు.
కాగా కమల హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నామినెటే చేసిన దగ్గరి నుంచి ట్రంప్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే..కమల హారిస్ ను ఎన్నుకొని డెమొక్రాట్స్ తప్పు చేసారని ..అసలు ఆమె అమెరికా కు చెందిన వ్యక్తి కారు అని ఇలా ఎన్నో విమర్శలు ట్రంప్ చేసాడు..బిడెన్ కంటే కూడా కమలా నే అత్యంత ప్రమాదకర వ్యక్తి అని ట్రంప్ వ్యాఖ్యానించాడు