Advertisement

  • అన్యాయంగా తండ్రి కొడుకులను చంపేశారు ..పి.జయరాజ్‌, బెనిక్స్‌ ల హత్యపై కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు

అన్యాయంగా తండ్రి కొడుకులను చంపేశారు ..పి.జయరాజ్‌, బెనిక్స్‌ ల హత్యపై కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు

By: Sankar Sun, 28 June 2020 7:22 PM

అన్యాయంగా తండ్రి కొడుకులను చంపేశారు ..పి.జయరాజ్‌, బెనిక్స్‌ ల హత్యపై కమల్ హాసన్ తీవ్ర వ్యాఖ్యలు



లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పి.జయరాజ్‌, బెనిక్స్‌లను పోలీసులు జైలు కస్టడీలో హింసించి చంపిన ఘటనను నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై కమల్‌ హాసన్‌ స్పందిస్తూ.. మృతి చెందిన తండ్రీకొడుకుల ఘటనలో సీఎం ప‌ళ‌నిస్వామి ప్రధాన నిందితుడుని ఆరోపించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే పూర్తిగా బాద్యత వహించాలన్నారు.

తమిళనాడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి పోలీసుల చర్యకు మద్దతు పలకుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది సరైన పద్దతి కాదని దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు మద్దతు పలుకుతూ ప్రభుత్వం ఉగ్రవాదానికి అనుమతి ఇస్తోందని విమర్శించారు. అదే విధంగా తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్‌ కాపర్‌ పరిశ్రమను మూసేయాలంటూ 2018లో నిరసన తెలిపిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టు​కున్న ఘటనను కమల్‌ గుర్తు చేశారు.


Tags :
|
|

Advertisement