Advertisement

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన తమిళ స్టార్ హీరో

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన తమిళ స్టార్ హీరో

By: Sankar Mon, 14 Dec 2020 12:53 PM

వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేస్తున్నట్లు ప్రకటించిన తమిళ స్టార్ హీరో


తమిళనాడు సినీ పరిశ్రమలో దిగ్గజ నటులు అయిన కమల్ హాసన్ , రజినీకాంత్ రాజకీయాలలో బిజీ అయ్యారు ..కమల్ హాసన్ ఇప్పటికే పార్టీని పెట్టగ , రజినీకాంత్ త్వరలోనే పార్టీని అనౌన్స్ చేయనున్నారు..దీనితో తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి...సినిమా వాళ్ళు అంటే ప్రాణమిచ్చే తమిళ ప్రజలకు సినిమా నటులను సీఎం లను చేసిన చరిత్ర ఉంది..అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రజిని , కమల్ విషయంలో ఇతర పార్టీలు అప్రమత్తంగా ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు..

ఇక రాబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను క‌చ్చితంగా పోటీ చేయ‌నున్న‌ట్లు క‌మ‌ల్ హాస‌న్ తెలిపారు. మ‌ధురైలో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అయితే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌న్న విష‌యాన్ని మాత్రం త‌ర్వాత ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు క‌మ‌ల్ వెల్ల‌డించారు.

ఆదివారం రోజున మ‌ధురైలో క‌మ‌ల్‌హాస‌న్ ర్యాలీ నిర్వ‌హించారు. భారీ సంఖ్య‌లో క‌మ‌ల్ పార్టీ అభిమానులు ఆ ర్యాలీలో పాల్గోన్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్‌కు శంకుస్థాప‌న చేయ‌డాన్ని క‌మ‌ల్ త‌ప్పుప‌ట్టారు. సగం దేశం ఆక‌లి బాధ‌తో ఉంటే, కొత్త పార్ల‌మెంట్ బిల్డింగ్ అవ‌స‌ర‌మా అని క‌మ‌ల్ విమ‌ర్శ‌లు చేశారు

Tags :

Advertisement