రైతులు చేస్తున్న ఆందోళనలపై స్పందించిన కమల్ హాసన్...రైతులు డిమాండ్లను వినాలి...
By: chandrasekar Tue, 01 Dec 2020 8:16 PM
ఇటీవల కేంద్ర ప్రభుత్వం
అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత ఆరు రోజుల నుంచి పలు రైతు
సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలో రైతులు చేస్తున్న ఆందోళనలపై మక్కల్ నీధి
మయిం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్
స్పందించారు. కేంద్ర
ప్రభుత్వం రైతులు డిమాండ్లను వినాలని కమల్ హాసన్ సూచించారు. వారి డిమాండ్లను
పట్టించుకోవాలని కేంద్రానికి ఆయన విన్నవించారు. ఈ మేరకు కమల్ హాసన్ మంగళవారం
తమిళనాడులోని చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. తమిళనాడులో సీఎం పరిపాలన పట్ల సంతృప్తి లేదని తెలిపారు. నివర్
తుఫాన్ బాధితులకు సహాయం చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని కమల్ హాసన్
అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన ఖండించారు. ఈ సమావేశంలో ఆ
రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సంతోష్ బాబు మక్కల్ పార్టీలో చేరారు. ఈ
సందర్భంగా ఆయన్ను కమల్ మక్కల్ నీధి మయం పార్టీలోకి ఆహ్వానించారు.