కల్యాణ లక్ష్మి పథక౦ మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు విడుదల
By: chandrasekar Thu, 05 Nov 2020 4:22 PM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తోంది. ఈ పధక౦ ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో
వెలుగులు నింపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్
పేదింటి ఆడబిడ్డల వివాహానికి లక్షా నూట పదహారు రూపాయాలు అందించి ఆర్థికంగా
ఆదుకుంటున్నారు.
దీంతో ఆ ఆడబిడ్డలు
కేసీఆర్ను మేనమామగా వర్ణించుకుంటూ.. ఆయనకు రుణపడి ఉంటామని అంటున్నారు.
అలాంటి గొప్ప పథకానికి మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
బీసీ సంక్షేమశాఖ ఈ మేరకు
బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి నిధులు విడుదల
చేస్తూ పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేసింది.
Tags :
scheme |
released |