Advertisement

  • కల్యాణ లక్ష్మి పథక౦ మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు విడుదల

కల్యాణ లక్ష్మి పథక౦ మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు విడుదల

By: chandrasekar Thu, 05 Nov 2020 4:22 PM

కల్యాణ లక్ష్మి పథక౦ మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు విడుదల


తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం అమ‌లు చేస్తోంది. ఈ పధక౦ ఎంతో మంది నిరుపేద‌ల కుటుంబాల్లో వెలుగులు నింపింది.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేదింటి ఆడ‌బిడ్డ‌ల వివాహానికి ల‌క్షా నూట ప‌ద‌హారు రూపాయాలు అందించి ఆర్థికంగా ఆదుకుంటున్నారు.

దీంతో ఆ ఆడ‌బిడ్డ‌లు కేసీఆర్‌ను మేన‌మామ‌గా వ‌ర్ణించుకుంటూ.. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని అంటున్నారు. అలాంటి గొప్ప ప‌థ‌కానికి మూడో త్రైమాసికానికి సంబంధించి రూ.337.50 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

బీసీ సంక్షేమశాఖ ఈ మేర‌కు బుధవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కానికి నిధులు విడుదల చేస్తూ పరిపాలన శాఖ అనుమతులు మంజూరు చేసింది.

Tags :
|

Advertisement