కడప జిల్లా తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అరెస్ట్
By: chandrasekar Mon, 05 Oct 2020 09:37 AM
కడప జిల్లా తెలుగు దేశం
పార్టీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ అరెస్ట్ చేయబడ్డారు. తెలుగు దేశం పార్టీ కడప
జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2003కు
సంబంధించిన పాత కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా రాజంపేటకు చెందిన
సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు హరిప్రసాద్ను అదుపులోకి
తీసుకున్నారు. ఈ సందర్భంగా 17 ఏళ్ల క్రితం కేసులో ఎలా అరెస్టు చేస్తారంటూ
పోలీసులతో హరిప్రసాద్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం
నెలకొంది. చివరికి సంయమనంతో వ్యవహరించిన పోలీసులు భారీ బందోబస్తు మధ్య హరిప్రసాద్ను
రాజంపేట కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో హాజరుపరచబడ్డ
హరిప్రసాద్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో హరిప్రసాద్ను సబ్
జైలుకు తరలించారు. టీడీపీ జిల్లా నాయకుడు అయిన హరిప్రసాద్ మీడియా ద్వారా
బెదిరింపులకు దిగుతున్నాడని శ్రీ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య ఆరోపించారు. ప్రభుత్వం పై బురదజల్లడానికి తనను
రాజకీయ నేతగా చిత్రికరిస్తున్నారని విమర్శించారు. తనకు ఏ రాజకీయాలతో సంబంధం
లేదన్నారు. సాయి ఏడ్యుకేషన్ సోసైటీ ఆస్తులను అడ్డదారిలో అమ్ముకోవడంపైనే ఫిర్యాదు
చేసినట్లు చెప్పుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగలేదని, ఇప్పుడు
ఫిర్యాదులో భాగంగా విచారిస్తే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని సుబ్బయ్య
విమర్శించారు. ఇందువల్ల కడప ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.