- హోమ్›
- వార్తలు›
- గుండె పగిలినట్లు అనిపించింది..చాలా సేపు తేరుకోలేకపోయాను ..ధోని రిటైర్మెంట్ పై స్పందించిన స్టార్ క్రికెటర్
గుండె పగిలినట్లు అనిపించింది..చాలా సేపు తేరుకోలేకపోయాను ..ధోని రిటైర్మెంట్ పై స్పందించిన స్టార్ క్రికెటర్
By: Sankar Wed, 19 Aug 2020 6:49 PM
ఇండియన్ స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా వీడుకోలు పలకడంతో అభిమానులు మాత్రమే కాదు తోటి ఆటగాళ్లు కూడా షాక్ కు గురి అయ్యారు..ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ విషయం గురించి కేఎల్ రాహుల్ మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ..
నిజంగా నా గుండె పగినట్లు అనిపించింది. చాలా సేపటి వరకు తేరుకోలేకపోయాను. నాతో పాటు ధోని సారథ్యంలో ఆడిన ప్రతీ క్రికెటర్ ఇలాంటి ఉద్వేగానికి లోనై ఉంటారు. తనకు వీడ్కోలు చెబుతూ స్పెషల్గా ఫేర్వెల్ ఏర్పాటు చేసే వీల్లేకుండా పోయింది. జట్టులోని ప్రతి ఆటగాడికి ధోని పూర్తి స్వేచ్చనిచ్చేవాడు. ఎలా ఆడాలో చెబుతూనే మా సహజత్వాన్ని కోల్పోకుండా, మా తప్పుల్ని మేమే తెలుసుకునేలా గైడ్ చేసేవాడు.
మమ్మల్ని మాలాగే ఉంచిన ఘనత ధోనీకే దక్కుతుంది. ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే మొదటగా పరిగెత్తుకు వెళ్లేది ధోని దగ్గరికే. తనెప్పుడూ మమ్మల్ని ముందుకు నడిపేందుకు సిద్ధంగా ఉండేవాడు. ధోనికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ధోనితో పాటు రోహిత్, కోహ్లి సారథ్యంలో ఆడటానికి నేను ఇష్టపడతాను. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కో విషయం నేర్చుకోవచ్చు’’అని చెప్పుకొచ్చాడు. కాగా కర్ణాటకకు చెందిన రైట్హ్యాండ్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్-2020లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున కెప్టెన్గా మైదానంలోకి దిగనున్నాడు.