అతడి ఎమోషన్స్ తో ఆడుకోము ...జస్టిన్ లాంగర్
By: Sankar Tue, 15 Dec 2020 4:53 PM
టీమిండియాతో ఈ నెల 17 నుంచి టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది .గత పర్యటనలో ఎదురయిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తుంది..అయితే కోహ్లీని ఎలా అవుట్ చేయాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు ఆసీస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డాడు...
ఇంకో మూడు రోజుల్లో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. టీమిండియాపై గెలిచేందుకు మా ప్రణాళికలను రచించుకుంటున్నాం. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లిని ఎలా అవుట్ చేయాలనే దానిపై చర్చించుకున్నాం. అంతేకాని కోహ్లిని తిట్టడం వాటి గురించి మేమెందుకు మాట్లాడతాం..ఇదంతా రబ్బిష్. మేము కేవలం అతని నైపుణ్యంపైనే దెబ్బతీస్తాం తప్ప.. ఎమోషన్స్తో ఆడుకోం.
మాకు ఎమోషన్స్ ఉంటాయి.. వాటిని కంట్రోల్ చేసుకొని ముందుకు సాగుతాం. కోహ్లిలో గొప్ప ఆటగాడే కాదు మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. కోహ్లి టీమిండియాకు చాలా విలువైన ఆటగాడు.. ఫాంలో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. నాకు అతనిపై చాలా గౌరవం ఉంది. కానీ అతన్ని అవుట్ చేస్తేనే మా పని సులువుగా జరిగిపోతుంది. కోహ్లి ఒక్క టెస్టు మ్యాచ్కు మాత్రమే అందుబాటులో ఉంటాడన్న విషయం తెలుసు.. అందుకే ఎలా అవుట్ చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నాం'అంటూ చెప్పుకొచ్చాడు