తెలంగాణ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియామకం
By: Sankar Tue, 15 Dec 2020 7:50 PM
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న ఆమె పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రస్తుత తెలంగాణ ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ను ఉత్తరాఖండ్కు బదిలీ చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాగా, నూతన న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సోమవారం సిఫార్సు చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా హిమ కోహ్లీ నియమితులయ్యారు. ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమ కోహ్లీ ఢిల్లీ హైకోర్టులో జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు