Advertisement

  • మందకొడిగా సాగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్

మందకొడిగా సాగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్

By: Sankar Tue, 01 Dec 2020 09:59 AM

మందకొడిగా సాగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల పోలింగ్


తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఎన్నికలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ...దేశంలో అత్యంత గొప్ప నగరాలలో ఒకటైన హైదరాబాద్ యొక్క భవిత్యంను తెలిపే ఈ జిహెచ్ఎంసి ఎన్నికలలో ఓటు వేసేందుకు నగర వాసులు అంతగా ఆసక్తిచూపడం లేదు..

ఈ రోజు ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అయినప్పటికీ ఓటర్లు మాత్రం అంతగా రావడంలేదు..మొదటి రెండు గంటల్లో కేవలం 4.2 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది... ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓటింగ్‌కు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపడంలేదు.. ఇక ఓటు హక్కు వినియోగించుకుంటున్న అధికారులు, ప్రముఖులు.. తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు..

గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. ఐదేళ్ల పాటు నగర భవిష్యత్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే.. ఓటర్ల నిరాశక్తత ఎంటో తెలుస్తుంది. 2009లో 42.92 శాతం ఓటింగ్ జరిగింది. 2016లో అది కేవలం మూడు శాతం పెరిగింది. గత ఎన్నికల్లో 45.27 శాతం మాత్రమే ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు..


Tags :
|

Advertisement