యూపీలో మరొక దారుణం ...జర్నలిస్ట్ సజీవ దహనం
By: Sankar Mon, 30 Nov 2020 1:45 PM
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నేరాలు చాల ఎక్కువ అయిపోయాయి...ప్రజలకు కనీస భద్రత అనేది లేకుండా పోయింది...తాజాగా అదే యుపిలో మరొక దారుణం చోటు చేసుకుంది...గుర్తు తెలియని దుండగులు ఇంటికి నిప్పంటించి ఓ జర్నలిస్టును సజీవ దహనం చేశారు.
ఈ ఘటనలో యూపీలోని బలారాంపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. బలరాంపూర్ పట్టణంలోని స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్ తో కలిసి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆగంతకులు ఇంటికి నిప్పంటించి జర్నలిస్టు రాకేష్ సింగ్తో పాటు అతని స్నేహితుడిని సజీవదహనం చేశారు. ఈ ఘటన జరిగినప్పుడు జర్నలిస్ట్ భార్య, పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారు.
ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన వచ్చి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మరణించిన జర్నలిస్ట్ కుటుంబానికి రూ. 5 లక్షల చెక్కును జిల్లా అధికారులు మృతుడి భార్యకు అందించారు. బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు.