రాజస్థాన్ రాయల్స్ అభిమానులకు గుడ్ న్యూస్ ..ఆ స్టార్ ఆటగాడు వచ్చేశాడు
By: Sankar Sun, 27 Sept 2020 08:12 AM
తొలి మ్యాచ్ లో పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్ మీద సంచలన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు బలం ఇంకా పెరిగింది..ఆ జట్టు స్టార్ ఆటగాడు జొస్ బట్లర్ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు..ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ..
తాము ఆడబోయే తదుపరి మ్యాచ్లో అసలు సిసలు పోరు ఎదురుకానుందని రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తెలిపాడు. ఆదివారం కింగ్స్ పంజాబ్తో మ్యాచ్లో కఠిన పరీక్ష తప్పదని బట్లర్ అభిప్రాయపడ్డాడు. ఈ గేమ్ కోసం తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్న బట్లర్.. తమ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేయడం గొప్పగా అనిపిస్తోందన్నాడు. ‘ నా తొలి గేమ్ కోసం ఎదురుచూస్తున్నా.
మా జట్టులో అంతా మంచి జోష్లో ఉన్నారు. మా క్యాంప్లో వాతావరణం చాలా గొప్పగా అనిపిస్తోంది. కుర్రాళ్లతో ట్రైనింగ్ సెషన్లో పాల్గొనడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. కింగ్స్ పంజాబ్ జట్టు కూడా బలంగా ఉండటంతో హోరాహోరీ పోరు తప్పదు.ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్(132 నాటౌట్) చెలరేగి సెంచరీ చేయడంపై బట్లర్ స్పందించాడు. ‘ కేఎల్ రాహుల్ ఒక అసాధారణ ఆటగాడు. ఆర్సీబీ నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. రాహుల్ ఎప్పుడూ కీలక వికెటే. రేపటి మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు తప్పవని అనుకుంటున్నా. షార్జా స్మాల్ గ్రౌండ్ కావడంతో భారీ పరుగులు వచ్చే అవకాశం ఉంది