జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటన; అమెరికాలో బేబీ పౌడర్ అమ్మకాలు లేవు
By: chandrasekar Thu, 21 May 2020 2:39 PM
జాన్సన్ అండ్ జాన్సన్
ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో నమోదైన వేలాది కేసులను సంస్థ
ఎదుర్కొంటోంది. అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ అమెరికా, కెనడా
దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపి వేయనున్నది. కొంతకాలం పాటు సాగిన కోర్ట్ వివాదాల తర్వాత సంస్థ
కొన్ని కోట్ల డాలర్ల పరిహారాన్ని చెల్లించవలసి వస్తోంది. అయితే కంపెనీ మాత్రం తమ
ఉత్పత్తులు సురక్షితమైనవేనని సమర్ధించుకుంటూనే వస్తోంది.
అమెరికా కన్స్యూమర్
వ్యాపారంలో 0. 5 శాతం ఉండే టాల్క్ అమ్మకాలని క్రమేపీ తగ్గించుకుంటూ
వస్తామని జాన్సన్ అండ్ జాన్సన్ పేర్కొంది.
ఇప్పటికే ఉత్పత్తి అయి ఉన్న
సరుకుల్ని మాత్రం రిటైల్ మార్కెట్లో అమ్ముతారని తెలిపింది. ప్రజల అలవాట్లు మారడం
వలన, తమ
ఉత్పత్తుల సురక్షణ పట్ల తప్పుడు సమాచారం ప్రచారం కావడం వలన కంపెనీ ఉత్పత్తులకు
నార్త్ అమెరికాలో డిమాండ్ తగ్గిందని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది.
సంస్థపై కేసులు
వేయడానికి న్యాయవాదులు వినియోగదారులని
ప్రోత్సహించారని పేర్కొంది. జాన్సన్
అండ్ జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైనదని తాము కచ్చితంగా నమ్ముతున్నామంది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా పరిశీలించి తమ
సంస్థ తయారు చేసే ఉత్పత్తుల సురక్షిత ప్రమాణాల ప్రకారం ఉన్నాయని వైద్య నిపుణులు
ధృవీకరించినట్లు తెలిపింది.
కరోనా వైరస్తో తలెత్తిన
పరిస్థితుకారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు
వివరించింది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.. బేబీ టాల్క్లో ఆస్బెస్టాస్
ఛాయలు కనిపించాయని చెప్పిన తర్వాత కూడా సంస్థ అక్టోబర్లో తమ ఉత్పత్తుల్లో అసలు
ఆస్బెస్టాస్ లేదని చెప్పింది.
జాన్సన్ అండ్ జాన్సన్
టాల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన 22 మంది
మహిళలకు 4,700 కోట్ల
డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని 2018లో కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై సదరు సంస్థ
అప్పీలు చేసింది.