అమెరికా అధ్యక్ష ఎన్నికలో జో బిడెన్ వైపు మొగ్గు చూయిస్తున్న సర్వేలు
By: Sankar Tue, 13 Oct 2020 5:20 PM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం స్పష్టం కనిపిస్తున్నదని అమెరికాలోని పలు వార్తాపత్రికల సర్వేలు చెప్తున్నాయి. అయితే ఇద్దరి మధ్య విజయావకాశాలు చాలా తక్కువ శాతంతో ఉండటంతో అమెరికన్లతోపాటు ఇతర దేశాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
అమెరికా ఎన్నికల సమయంలోనే కరోనా వైరస్ మహమ్మారి డొనాల్డ్ ట్రంప్ విజయంపై చాలా ప్రభావం చూపుతున్నదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతుండగా.. కరోనా విషయంలో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ అమెరికా ప్రజలు ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. కరోనా పాజిటివ్గా ఉన్న సమయంలో ట్రంప్కు ప్రజల నుంచి సానుభూతి లభించగా.. ఇప్పుడు మాత్రం ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నది.
సీఎన్ఎన్ పోల్ సర్వేలో ట్రంప్ కన్నా జో బిడెన్ 11 శాతం ఎక్కువ ప్రజల మద్దతు ఉన్నట్లుగా తేలింది. కరోనా విషయంలో ట్రంప్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని, ఇలాంటి అధ్యక్షుడు మళ్లీ రావడం వలన ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నట్లు చాలా మంది చెప్పినట్లు తెలుస్తున్నది. కరోనా విషయంలో ట్రంప్ది బాధ్యతారాహిత్యమని 63 శాతం మంది చెప్పగా.. తన చుట్టూ ఉండేవారి భద్రత, వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని విస్మరించారని పలువురు అభిప్రాయపడ్డారు.
సియానా కాలేజీతో కలిసి న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో కూడా జో బిడెన్కు మద్దతుగా ఓటర్లు నిలిచారు. రెండు ఎన్నికల్లోనూ నెవాడాలో బిడెన్ కంటే ట్రంప్ 6 పాయింట్లు వెనుకబడి ఉన్నారు. నాలుగేండ్ల క్రితం ట్రంప్ ఒహియో నుంచి గెలిచినప్పటికీ, ప్రస్తుత పోల్లో అతను ఇంకా బిడెన్ కంటే 1 పాయింట్ వెనుకబడి ఉన్నాడు. అయితే, టెక్సాస్ ఒక్కటే ట్రంప్కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం.