Advertisement

  • ట్రంప్ దేశాన్ని చీకటిలోకి నెట్టేశాడు ..నేను గెలిస్తే చీకటిని పారద్రోలుతా ..జో బిడెన్

ట్రంప్ దేశాన్ని చీకటిలోకి నెట్టేశాడు ..నేను గెలిస్తే చీకటిని పారద్రోలుతా ..జో బిడెన్

By: Sankar Fri, 21 Aug 2020 10:43 AM

ట్రంప్ దేశాన్ని చీకటిలోకి నెట్టేశాడు ..నేను గెలిస్తే చీకటిని పారద్రోలుతా ..జో బిడెన్


అమెరికా ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడె‌న్ నామినేష‌న్‌ను అంగీక‌రించారు. తాను గెలిస్తే దేశంలో ఉన్న చీక‌ట్ల‌ను పార‌ద్రోలి.. వెలుగును నింపుతానంటూ బైడెన్ తెలిపారు. డెలావ‌ర్‌లోని విల్మింగ్ట‌న్‌లో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశాన్ని చీక‌ట్లోకి నెట్టేసిన‌ట్లు ఆరోపించారు. ద్వేషాన్ని, భ‌యాన్ని, విభ‌జ‌న‌ను ట్రంప్ క్రియేట్ చేశార‌ని బైడెన్ విమ‌ర్శించారు.

నేను మీకు మాట ఇస్తున్నాను, మీరు న‌మ్మ‌కంతో న‌న్ను అధ్య‌క్షుడిని చేస్తే, ఉత్త‌మైన పాల‌ను అందిస్తాన‌ని, మీలో వెలుగుల్ని నింపుతాన‌ని, చీక‌ట్ల‌ను కాదు అని బైడెన్ అన్నారు. దేశ ప్ర‌జ‌లంతా ఒక్క‌టి కావాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు. పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా.. ఒక‌టిగా ఉంటే అమెరికాకు ప‌ట్టిన అంధ‌కారాన్ని వ‌దిలించ‌గ‌ల‌మ‌న్నారు. భ‌యాన్ని ఆశ‌తో జ‌యిద్దామ‌ని, ఊహాలు కాదు.. వాస్త‌వాల‌ను జోడిద్దామ‌ని, ప్ర‌త్యేక అధికారాల‌కు బ‌దులుగా మంచిత‌నాన్ని నింపుదామ‌ని బైడెన్ అన్నారు. న‌వంబ‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో బ్యాలెట్ రూపంలో మ‌నిషి గుణ‌మే పోటీప‌డుతోంద‌న్నారు.

కాగా వచ్చే నవంబర్ లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి..ఒకవైపు ట్రంప్ రెండోసారి అద్యక్షుల పోటీలో ఉండగా , మరోవైపు డెమోక్రాటిక్ పార్టీ తరుపున జో బిడెన్ పోటీ పడుతున్నాడు..ఇక ఉపాధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ పార్టీ నుంచి భారత సంతతికి చెందిన కమల హారిస్ పోటీపడుతున్న విషయం తెలిసిందే..


Tags :
|
|

Advertisement