Advertisement

  • టైమ్‌ మ్యాగజైన్ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్...

టైమ్‌ మ్యాగజైన్ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్...

By: chandrasekar Sat, 12 Dec 2020 5:03 PM

టైమ్‌ మ్యాగజైన్ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్...


ఏడాదికి ఒకసారి టైమ్‌ మ్యాగజైన్‌ ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసే ‘‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’’లో 2020లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్‌లు‌ సెలెక్ట్ అయ్యారు. టైమ్‌ మ్యాగజైన్‌ తాజా సంచికలో అమెరికా కథనే మార్చారని తన వారిని ప్రశంసించింది. ఈ ఏడాది పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా తుది జాబితాలో ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంటోనీ ఫౌచి, జాతి వివక్ష పోరాట సంస్థలు, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నారు.

మొత్తం ప్రపంచం కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడుతూ ఉంటే దానికి మందు ఎలా వెయ్యాలో దృష్టి పెట్టారని పేర్కొంది. పోటీని తట్టుకొని జో బైడెన్, కమలా హ్యారిస్‌లు ముందుకు దూసుకెళ్లి టైమ్‌ ఫ్రంట్ పేజీలో నిలిచారు. టైమ్‌ మ్యాగజైన్‌ హీరోస్‌ ఆఫ్‌ 2020 లిస్ట్ లో ఇండియన్‌ అమెరికన్‌ రాహుల్‌ దుబేకి స్థానం లభించింది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్న 70 మందికి పైగా నిరసనకారులకి రాహుల్‌ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు. గత ఏడాది టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైన స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్‌ 16 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టిస్తే, ఈ ఏడాది జో బైడెన్‌ 78 ఏళ్ల వయసులో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచారు.

Tags :

Advertisement