Advertisement

  • ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం

ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం

By: chandrasekar Mon, 24 Aug 2020 1:17 PM

ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం


తెలంగాణను మరింత ఆర్ధిక ప్రగతి పదంలో నడుపుటకు ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి పరిశీలనలు జరుగుతున్నాయి. ఫార్మాసిటీలో ప్రభావిత కుటుంబాల జాబితా తయారుచేయాలి. కుటుంబసభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్‌ అర్హతలను మ్యాపింగ్‌ చేయాలి. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌, ఇతర శిక్షణా సంస్థల సహకారం తీసుకోవాలి. ఫార్మాసిటీలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకుగాను వారికి శిక్షణ ఇచ్చేందుకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌కు భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ఇందులో భాగంగా ప్రగతిభవన్‌లో శనివారం ఫార్మా సిటీపై సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫార్మా సిటీ పురోగతిపై అధికారులు మంత్రికి వివరించారు. స్థానికుల సహకారంతో ఫార్మాసిటీ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ స్థానికుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని, ఈ దిశగా ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. ఫార్మాసిటీలో ప్రభావిత కుటుంబాల జాబితా తయారుచేయాలని ఆదేశించారు.

భూమి ఇచ్చే కుటుంబసభ్యుల విద్యార్హతలు, ఇతర టెక్నికల్‌ అర్హతలను మ్యాపింగ్‌ చేయాలన్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌, ఇతర శిక్షణా సంస్థల సహకారం తీసుకోవాలని చెప్పారు. స్థానికులకు శిక్షణ ఇచ్చేందుకు ఫార్మా సిటీ పరిసర మండలాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఫార్మాసిటీలో ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణను ఈ కేంద్రాల్లో స్థానికులకు ఇవ్వాలని చెప్పారు. ఇందుకు ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టనున్న ఫార్మా కంపెనీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు, పెట్టుబడిదారులకు ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చే చర్యలు తీసుకున్నదని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ మాణిక్‌రాజ్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, ఫార్మాసిటీ ఎస్పీవీ సీఈవో శక్తి నాగప్పన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇటు పరిశ్రమలకు అటు ప్రజలకు మేలు కలిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement