Advertisement

  • జేఎన్టీయూ పరిధిలో యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా

జేఎన్టీయూ పరిధిలో యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా

By: Sankar Sat, 13 June 2020 3:30 PM

జేఎన్టీయూ పరిధిలో యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా


కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇప్ప‌టికే పదో తరగతి పరీక్షలు రద్దు చేశారు. అలాగే మిగతా కొన్ని ఎగ్జామ్స్ కూడా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా జేఎన్టీయూ ప‌రిధిలోని డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ కూడా వాయిదా ప‌డ్డాయి.

జూన్ 20 నుండి జరగాల్సిన‌ యూజీ, పీజీ ఎగ్జామ్స్ వాయిదా వేసినట్లు శుక్ర‌వారం జేఎన్టీయూ హైదరాబాద్‌ ప్రకటించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎటువంటి ఎగ్జామ్స్ నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని వర్సిటీ అధికారులు వివరించారు. పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీల వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.


Tags :
|
|
|
|

Advertisement