2021 ద్వీతీయార్ధంలో జియో 5 జి సేవలు ....ముకేశ్ అంబానీ
By: Sankar Tue, 08 Dec 2020 12:42 PM
ఇండియాలో జియో 5జీ సేవలను 2021 ద్వితీయార్ధంలో తీసుకువస్తున్నట్లు వెల్లడించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ. మంగళవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు..దేశంలో 5జీ సేవలతోపాటు గూగుల్తో కలిసి అతి తక్కువ ధరకు ఆండ్రాయిడ్ ఫోన్ను తీసుకొచ్చే ఆలోచనలో కూడా జియో ఉంది.
దేశంలో 5జీ సేవలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించడానికి విధాన నిర్ణయాలు అవసరమని ముకేశ్ చెప్పారు. స్వదేశంలో అభివృద్ధి చేసిన నెట్వర్క్, హార్డ్వేర్, సాంకేతిక పరికరాలతోనే జియో తన 5జీ సేవలను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 5జీ సేవలు అందించడానికి చాలా రోజుల కిందటి నుంచే జియో ప్రయత్నాలు మొదలుపెట్టింది.
దీనికోసం శామ్సంగ్, క్వాల్కామ్ కంపెనీలతో జియో కలిసి పని చేస్తోంది. స్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చిన వెంటనే 5జీ సేవలు అందించే దిశగా జియో పని చేస్తుందని జులైలో జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ముకేశ్ వెల్లడించారు.