నెల్సన్ మండేలా ఆరో సంతానం జిండ్జీ మండేలా మృతి
By: chandrasekar Tue, 14 July 2020 11:45 AM
ప్రపంచవ్యాప్తంగా
వర్ణవివక్ష వ్యతిరేక పోరాటానికి ప్రసిద్ధి చెందిన దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి
అధ్యక్షుడు నెల్సన్ మండేలా కుమార్తె జిండ్జీ మండేలా (59) కన్నుమూశారు.
సోమవారం ఉదయం జోహన్నెస్బర్గ్లోని దవాఖానలో ఆమె తుది శ్వాస విడిచారు.
గింజీకి నలుగురు పిల్లలు.
మరణానికి గల కారణాలను ఆమె కుటుంబసభ్యులుగానీ, వైద్యులుగానీ వెల్లడించలేదు. అయితే, కొడుకు
బంబతా ట్వీట్ చేసి తల్లి మరణం గురించి సమాచారం ఇచ్చారు.
నెల్సన్ మండేలా ఆరో
సంతానం అయిన జిండ్జీ మండేలా. డెన్మార్క్లో దక్షిణాఫ్రికా దేశ రాయబారిగా
పనిచేస్తున్నారు. 1985 లో జైలుశిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా తన విడుదల
కోసం షరతులతో కూడిన ప్రతిపాదనను తిరస్కరించినప్పుడు జిండ్జీ తెరపైకి వచ్చారు.
తండ్రి తరపున జిండ్జీ
మండేలా ఒక బహిరంగ సమావేశంలో ఈ విషయాన్ని లేఖ ద్వారా చదివి వినిపించారు. ఇది
ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది.
జిండ్జీ మండేలా మరణం పట్ల
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా విచారం వ్యక్తం చేశారు. జిండ్జీ గొప్ప
వ్యక్తి కుమార్తె మాత్రమే కాకుండా కష్టపడుతున్న ప్రజలకు స్ఫూర్తి కూడా అని తన
సంతాప సందేశంలో పేర్కొన్నారు దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి నలేది పాండర్.