Advertisement

  • జేఈఈ మెయిన్స్ విషయంలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

జేఈఈ మెయిన్స్ విషయంలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

By: Sankar Fri, 23 Oct 2020 07:04 AM

జేఈఈ మెయిన్స్ విషయంలో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం


జేఈఈ మెయిన్స్ మరిన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (జేఏబీ) నిర్ణయించిందని తెలిపారు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్... జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ), 2020కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రాంతీయ భాషలో నిర్వహించే పరీక్ష ఆధారంగా రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామన్నారు.

జేఈఈ మెయిన్స్ ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం కల్పించే రాష్ట్రాల స్టేట్ లాంగ్వేజ్‌‌ను కూడా దీనిలో చేర్చుతామని చెప్పారు. పీఐఎస్ఏ పరీక్షలో టాప్ స్కోరింగ్ కంట్రీస్ బోధనా మాధ్యమంగా మాతృ భాషను ఉపయోగిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విద్యార్థులు ప్రశ్నలను అవగాహన చేసుకుని మరింత మెరుగైన స్కోర్ సాధించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు రమేష్‌ పోఖ్రియాల్.. తాము ఇంగ్లిష్‌కు వ్యతిరేకం కాదని, విద్యా బోధనా మాధ్యమంగా మాతృ భాష ఉంటే భారతీయ భాషలు బలోపేతమవడానికి దోహదపడుతుందన్నారు. ఏ రాష్ట్రంపైనా ఏదైనా భాషను రుద్దాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.. 22 భారతీయ భాషలను బలోపేతం చేయడానికి తాము సానుకూలంగా ఉన్నామని.. ఈ భాషలన్నింటినీ ప్రోత్సహిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి.

Tags :

Advertisement