Advertisement

  • అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌న్న‌డ న‌టి జ‌యంతి

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌న్న‌డ న‌టి జ‌యంతి

By: chandrasekar Thu, 09 July 2020 1:26 PM

అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌న్న‌డ న‌టి జ‌యంతి


క‌న్న‌డ న‌టి జ‌యంతి(75) తొలుత హీరోయిన్‌గా న‌టించి ఆ త‌ర్వాత స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషించారు. 500కి పైగా సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించిన జ‌యంతి 300 సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించారు. 35 ఏళ్ళుగా అస్త‌మాతో బాధ‌ప‌డుతున్న ఆమె తాజాగా అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరారు.

శ్వాస సంబంధిత వ్యాధితో బెంగ‌ళూరు ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేరిన జ‌యంతికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా నెగెటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర‌పై ఉంచి జ‌యంతికి చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆరోగ్యం నిల‌కడ‌గా ఉంద‌ని ఆయ‌న కుమారుడు కృష్ణ కుమార్ పేర్కొన్నారు.

క‌రోనా ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఆమెని చూసేందుకు ఎవ‌రు ఆసుప‌త్రికి రావోద్ద‌ని కుటుంబ స‌భ్యులు విజ్ఞ‌ప్తి చేశారు. హిందీ, మరాఠీ, తమిళ‌, తెలుగు, కన్నడ, మలయాళం భాష‌ల‌లో న‌టించిన జ‌యంతి కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసింది. తెలుగులో భార్య భ‌ర్త‌లు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. సైరా చిత్రంలోను జ‌యంతి న‌టించి అల‌రించింది. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags :

Advertisement