రెడ్డివారిపల్లెకు చేరుకున్న ప్రవీణ్ మృతదేహం.. మధ్యాహ్నం అంత్యక్రియలు...!
By: Anji Wed, 11 Nov 2020 10:47 AM
జమ్ముకశ్మీర్ లో ఉగ్రమూకలతో పోరాటి ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి భౌతిక కాయం అతని స్వగ్రామం చేరుకుంది.
రాత్రి 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ప్రవీణ్ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా ఐరాల రెడ్డివారిపల్లి గ్రామానికి తీసుకువచ్చారు.
మృతదేహం ఊర్లోకి చేరుకోగానే ప్రవీణ్ తల్లిదండ్రులు, భార్య పిల్లలతో పాటు అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు,స్నేహితులు, బంధు మిత్రులు కన్నీటి పర్యంతమై జోహార్ ప్రవీణ్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. బాణాసంచాకాల్చి ఘన నీరాజనం పలికారు.
ఐరాలలో రాత్రి 2 గంటలకు ప్రవీణ్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ గ్రామస్థులంతా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ (బుధవారం) మధ్యాహ్నం1.30 నిమిషాలకు ప్రవీణ్ భౌతికకాయనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారు.