Advertisement

  • నేను బతికే ఉన్న ..చనిపోయాడు అనుకున్న జవాన్ నుంచి ఫోన్ కాల్

నేను బతికే ఉన్న ..చనిపోయాడు అనుకున్న జవాన్ నుంచి ఫోన్ కాల్

By: Sankar Thu, 18 June 2020 12:46 PM

నేను బతికే ఉన్న ..చనిపోయాడు అనుకున్న జవాన్ నుంచి ఫోన్ కాల్



చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో ఆ జవాన్ అమరులైనట్లు అతడి కుటుంబానికి సమాచారం అందింది. దీంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. కానీ, కన్నుమూశాడనుకున్న ఆ జవాన్ నుంచి అతడి భార్యకు బుధవారం ఫోన్ కాల్ వచ్చింది. ‘నేను ఇంకా బతికే ఉన్నా’ అంటూ ఆ జవాన్ చెప్పడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. విషాదంలో మునిగిపోయిన గ్రామస్థులు కూడా ఒక్కసారిగా తేరుకున్నారు. బీహార్‌లోని సరణ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ జవాన్ పేరు సునీల్.

ఈ గందరగోళానికి కారణం బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఇద్దరు జవాన్ల పేరు ఒకటే కావడం. అంతేకాదు, వారి తండ్రి పేర్లు కూడా ఒకటే. లఢక్‌లోని గాల్వన్ లోయలో చైనా బలగాలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. వీరిలో బీహార్‌కు చెందిన హవల్దార్‌ సునీల్ కుమార్‌ ఉన్నారు. ఆయన తండ్రి పేరు సుఖ్‌దేవ్.

సరణ్ జిల్లాకు చెందిన జవాన్ సునీల్ రాయ్ లేహ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తండ్రి పేరు సుఖ్‌దేవ్ రాయ్. ఇద్దరి జవాన్ల పేరు సునీల్ కావడంతో.. చైనాతో ఘర్షణల్లో మరణించిన సునీల్ కుమార్‌కు బదులుగా సునీల్ రాయ్‌ కుటుంబానికి ఇండియన్ ఆర్మీ నుంచి సమాచారం వెళ్లింది. దీంతో గందరగోళం నెలకొంది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సునీల్ రాయ్.. వెంటనే తన భార్య మేనకకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు.నా భర్త ఇకలేడనే వార్తతో కుంగిపోయా. కానీ, ఆయన నుంచి ఫోన్ రావడంతో ప్రాణం లేచి వచ్చింది. ఆ భగవంతుడు నాకు కొత్త జీవితం ప్రసాదించాడు అని జవాన్ సునీల్ రాయ్ సతీమణి మేనక పేర్కొన్నారు.


Tags :
|
|
|

Advertisement