Advertisement

  • జవహార్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల

జవహార్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల

By: chandrasekar Thu, 05 Nov 2020 10:37 AM

జవహార్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల


తెలుగు రాష్ట్రాల్లో జవహార్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. జవహార్ నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఉచిత విద్యా సదుపాయాన్ని పొందవచ్చు. ఇంటర్మీడియట్ వరకు ఉచిత వసతి, భోజన సదుపాయం వీరికి కల్పిస్తారు. నవోదయ విద్యాలయాలో నిర్వాహకులు వీరికి అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 2021-2022 విద్యా సంవత్సరంకు గాను భారతదేశ వ్యాప్తంగా ఉన్న విద్యాలయాల్లో ఆరవ తరగతి విద్యార్థులను అడ్మిషన్స్ కోసం ఆహ్వానించారు. దేశ వ్యాప్తంగా మొత్తం 661 స్కూళ్లు అందుబాటులో ఉండగా అందులో 15 విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో 9 ఉన్నాయి. ఇందులో విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు.

రాష్ట్రంలోని ప్రతీ నవోదయా విద్యాలయంలో 6వ తరగతి విద్యార్థుల కోసం 80 సీట్లను కేటాయిస్తారు. అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులకు ఈ అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం 5వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు జవహార్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ పరీక్షల కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో విద్యార్థులు అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రతీ విద్యార్థికి ఈ ఎగ్జామ్ లో పాల్గొనే అవకాశం కేవలం ఒకసారి మాత్రమే లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం 75 శాతం సీట్లను కేటాయిస్తారు. మరో 25 శాతం సీట్లను ఇతర ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు. దీనిలో అర్హత సాధిస్తే ఇంటర్మీడియట్ వరకు అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందిస్తారు.

Tags :

Advertisement