Advertisement

  • అతడు పాక్ క్రికెట్ ను నాశనం చేస్తున్నాడు ..ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మియాందాద్

అతడు పాక్ క్రికెట్ ను నాశనం చేస్తున్నాడు ..ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మియాందాద్

By: Sankar Thu, 13 Aug 2020 4:03 PM

అతడు పాక్ క్రికెట్ ను నాశనం చేస్తున్నాడు ..ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మియాందాద్



తన మాజీ సహచరుడు, ప్రస్తుత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దేశంలో క్రికెట్‌ను నాశనం చేశాడని ఆ దేశ లెజెండరీ ఆటగాడు జావేద్‌ మియాందాద్‌ తీవ్ర ఆరోపణ చేశాడు. క్రికెట్‌లో ఏబీసీలు కూడా తెలియని వారిచేతిలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)ను పెట్టాడని విమర్శించాడు.

పీసీబీలోని ఏ ఒక్క అధికారికీ క్రికెట్‌ గురించి అవగాహన లేదు. బోర్డు వ్యవహారాలను ప్రధాని ఇమ్రాన్‌ పట్టించుకోవడంలేదు. పీసీబీలోని పరిస్థితులపై ఇమ్రాన్‌ ఖాన్‌తో వ్యక్తిగతంగా మాట్లాడతా. దేశంలో క్రికెట్‌ దుస్థితికి కారకులైన వారిని వదలను’ అని మియాందాద్‌ చెప్పుకొచ్చాడు. క్రికెట్‌ గురించి తనకొక్కడికే అంతా తెలుసునని ఇమ్రాన్‌ భావిస్తున్నాడని అన్నాడు.

ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో గెలవాల్సిన మ్యాచ్ ను పాకిస్తాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే దీనితో ఆ జట్టు కెప్టెన్ అయిన అజార్ అలీ మీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి ..ఫామ్ లో లేని ఇద్దరు ఆటగాళ్ల వికెట్లు తీయలేక ఆపసోపాలు పడ్డ పాకిస్తాన్ జట్టు చివరకు ఓటమిని చవి చూసింది ..

Tags :
|

Advertisement