- హోమ్›
- వార్తలు›
- ధోని ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించండి ..మేము ఆతిథ్యం ఇస్తాం ..బీసీసీఐ కి ఆ రాష్ట్ర సీఎం సూచన
ధోని ఫేర్ వెల్ మ్యాచ్ నిర్వహించండి ..మేము ఆతిథ్యం ఇస్తాం ..బీసీసీఐ కి ఆ రాష్ట్ర సీఎం సూచన
By: Sankar Sun, 16 Aug 2020 07:22 AM
ఇండియన్ క్రికెట్ చరిత్రలో సచిన్ తర్వాత ఆ స్థాయిలో అభిమానులను , పాపులారిటీ ని సంపాదించిన ఆటగాడు అంటే ధోని నే , మరి అంతటి పాపులారిటీ ఉన్న ధోని ఇంత సాధారణంగా రిటైర్ అవ్వడం సగటు క్రీడాభిమానులు నచ్చడం లేదు..సచిన్ రిటైర్మెంట్ ఏ స్థాయిలో జరిగిందో ధోని కూడా అదే స్థాయిలో రిటైర్ అవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు..
అయితే ధోని మాత్రం ఎలాంటి ఆర్బాటం లేకుండా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బీసీసీఐకి కీలక సూచన చేశారు. ఎంఎస్ ధోనీ కోసం ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐకి సీఎం సూచించారు. జార్ఖండ్ అందుకు వేదిక అవుతుందని ప్రకటించారు.
ధోనీ సొంత రాష్ట్రం జార్ఖండ్ కావడంతో ఫేర్వెల్ మ్యాచ్ కోసం రాంచీని వేదిక చేయాలని ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ భావిస్తున్నారు. సీఎం అభ్యర్థనపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫేర్వెల్ మ్యాచ్ గానీ జరిగితే ధోనీ అభిమానులకు అది పండగ రోజనే చెప్పాలి.