Advertisement

  • తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జనసేన అధినేత పవన్ పర్యటన

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జనసేన అధినేత పవన్ పర్యటన

By: Sankar Tue, 01 Dec 2020 10:51 AM

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో జనసేన అధినేత పవన్ పర్యటన


తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. రేపు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడి రైతులతో మాట్లాడబోతున్నారు.

డిసెంబర్ 3,4,5 వ తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఆయా జిల్లాల్లో తుఫాన్ బాధిత రైతులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంట నష్టంపై అంచనా వేసి రైతులకు భరోసా కల్పించేందుకు పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే వచ్చిన నివర్ తుఫాన్ దెబ్బకు తమిళనాడుతో పాటుగా ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. ఇటు నివర్ ప్రభావం కృష్ణా, గుంటూరు జిల్లాలపై కూడా పడిన సంగతి తెలిసిందే.కాగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ఇప్పటికే ఏపీ సీఎం జగన్ ఏరియల్ సర్వే చేసిన విషయం తెలిసిందే...తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ మాటఇచారు ...అయితే గాలిలో ఏరియల్ సర్వే వలన ఎటువంటి ఉపయోగం ఉండదు అని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసాయి

Tags :
|

Advertisement