Advertisement

  • పెళ్లి వ్యాన్ బోల్తా ప్రమాదంపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్

పెళ్లి వ్యాన్ బోల్తా ప్రమాదంపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్

By: Sankar Fri, 30 Oct 2020 4:30 PM

పెళ్లి వ్యాన్ బోల్తా ప్రమాదంపై స్పందించిన జనసేనాని పవన్ కళ్యాణ్


తంటికొండ ప్రమాదంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యాక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారనే వార్త తనను కలచివేసింది అని అన్నారు. తన ట్విట్టర్ వేదికగా బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఆనందంగా పెళ్లి వేడుకకు హాజరై వస్తున్నవారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరుతున్నాట్లుగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించి ఆదుకోవాలి జసనేనాని కోరారు.

కాగా శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

Tags :
|

Advertisement