అన్నయ్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి ...పవన్ కళ్యాణ్ భావోద్వేగ పోస్ట్
By: Sankar Tue, 10 Nov 2020 4:38 PM
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి హోం క్వారంటైన్ లో ఉన్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.
కాగా అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తూ భావోద్వేగ సందేశాన్ని ట్విటర్ లో పోస్ట్ చేశారు. అన్నయ్య లాక్ డౌన్ ప్రకటించిప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా..ప్రతీ ఒక్కరిలో చైతన్యం కలిగించారు. తనవంతు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.
ప్రజారోగ్యంపై అవగాహన ఉన్న అన్నయ్య తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య కరోనా బారిన పడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా..పరీక్షల్లో మాత్రం పాజిటివ్ గా తేలింది. అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని జనసేన పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు