Advertisement

  • నివర్ తుపాను: పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు పర్యటన...ఇదే ఫుల్ షెడ్యూల్...!

నివర్ తుపాను: పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు పర్యటన...ఇదే ఫుల్ షెడ్యూల్...!

By: Anji Mon, 30 Nov 2020 9:04 PM

నివర్ తుపాను: పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు పర్యటన...ఇదే ఫుల్ షెడ్యూల్...!

నివర్ తుపాను కారణంగా పంటలు కోల్పోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు.

డిసెంబరు 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో... 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు చేరుకుంటారు.

అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

అనంతరం పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుకొని భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటించనున్నారు.

3వ తేదీన తిరుపతి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో పంట నష్టంపై జనసేన నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలవనున్నారు.

అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరు మీదుగా నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారని జనసేన నేతలు ప్రకటించారు.

Tags :

Advertisement