Advertisement

మరో వివాదంలో చిక్కుకున్న జనగామ ఎమ్మెల్యే...

By: chandrasekar Sat, 12 Dec 2020 8:12 PM

మరో వివాదంలో చిక్కుకున్న జనగామ ఎమ్మెల్యే...


ఇటీవల జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై వివాదాలు ఎక్కువగా వస్తున్నాయి. ఓ వివాదాస్పద 6 ఎకరాల స్థలంలో మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసి మురుగు నీటిని యశ్వంతాపుర్ వాగులోకి తరలించే యత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మాజీ సర్పంచ్ సుశీలమ్మ అడ్డుకోవడంతో నేలపై పడుకొని రెడ్డి నిరసన తెలిపారు. ఫిల్టర్ చేసిన నీటిని వాగులోకి తరలిస్తామంటే అడ్డుకోవడం సరికాదని ముత్తిరెడ్డి పేర్కొన్నారు.

చేర్యాలలో అర ఎకరం స్థలాన్ని ఆక్రమించారని స్థానిక విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మత్తడి ప్రవాహ నీటి మళ్లింపును చెరువు కట్టను ఆనుకుని చేపడుతున్నారంటూ ప్రతిపక్ష నాయకులు నిరసన చేస్తున్నారు. చెరువును ఆనుకుని కాకుండా ముత్తిరెడ్డి ఆక్రమించిన 20 గుంటల స్థలం మధ్య నుంచి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు ఫిర్యాదు చేశారు. తాను కబ్జా చేశానంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెరువు మత్తడి దూకినప్పుడు ఆ నీళ్లు రోడ్డుమీదికి రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని అధికారులకు సూచించానని చెప్పారు.

Tags :
|

Advertisement