Advertisement

  • తెలంగాణ సీఎం కెసిఆర్ అందుబాటులో లేకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

తెలంగాణ సీఎం కెసిఆర్ అందుబాటులో లేకపోవడంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా

By: Sankar Thu, 06 Aug 2020 1:42 PM

తెలంగాణ సీఎం కెసిఆర్ అందుబాటులో లేకపోవడంతో  అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా



తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. పరిష్కారం కోసం ఇరు రాష్ట్రాలతో ఆగష్టు 5న సమావేశం నిర్వహిస్తామని కేంద్రం జలశక్తి మంత్రి ప్రకటించారు. ఇదే విషయమై ఆయన లేఖలు రాశారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడంతోనే ఆగష్టు 5న నిర్వహించాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు లేఖ రాసింది.

కేసీఆర్‌కు వేరే కార్యక్రమాలు ఉండటంతో సమావేశంలో పాల్గొనడం సాధ్యం కాదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. ఆగష్టు 5న తెలంగాణ కేబినెట్ సమావేశమై.. నూతన సెక్రటేరియట్ నిర్మాణం, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.

తెలంగాణ సీఎం అందుబాటులో లేకపోవడంతో సమావేశం వాయిదా పడగా.. తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రం ప్రకటించింది. కాగా ఏపీ సర్కారు చేపట్టబోతున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఆపాలంటూ తెలంగాణ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆంధ్రా ప్రభుత్వం కూడా కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది.నదీ జలాల వివాదాలను పరిష్కరించే బాధ్యతలను రివర్ బోర్డులకే కట్టబెట్టాలని కేసీఆర్ సూచిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు

Tags :
|
|

Advertisement