Advertisement

జై కిషన్ న్యూస్ ఛానల్ ఎడిటర్ ఆత్మహత్య...!

By: Anji Wed, 02 Dec 2020 9:25 PM

జై కిషన్ న్యూస్ ఛానల్ ఎడిటర్ ఆత్మహత్య...!

హైద్రాబాద్ లో న్యూస్ ఛానల్ లో ఎడిటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనిచేస్తున్న ఆఫీసు భవనంపై నుండి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన సైఫా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మారుతి ప్లాజా కంప్లెక్ లో 5వ అంతస్తులో కేబుల్ ఛానల్ జై కిషన్ న్యూస్ ఛానల్ లో శివుడు అనే వ్యక్తి ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు.

శివుడు అలియాస్ శివ అనే వ్యక్తి అనుమాన స్పద ఈ స్థితిలో మృతి చెందాడు. శివ 5వ అంతస్తు నుండి 2వ అంతస్తులో పడి చనిపోయాడు.

మృతుడు కర్నూల్ జిల్లాలోని నంద్యాలకు చెందినవాడిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే సైఫాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శివ ఆత్మహత్య కు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. శివ పనిచేస్తున్న ఆఫీసు ఉద్యోగులతో పాటు.. స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement