Advertisement

తెలంగాణాలో మరోక ఎమ్యెల్యే కు కరోనా పాజిటివ్

By: Sankar Tue, 13 Oct 2020 2:17 PM

తెలంగాణాలో మరోక ఎమ్యెల్యే కు కరోనా పాజిటివ్


తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కరోనా బారిన పడుతున్నారు. అధికారులు, పోలీసులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కరోనా వైరస్ సోకుతూ వస్తోంది.

తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇటీవల సంజయ్ కుమార్ ఓ వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఆయనకు కరోనా సోకి ఉండచ్చని భావిస్తున్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టెస్ట్ చేయించుకున్న సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో హోమ్ క్వారన్ టైన్ లోకి వెళ్లి పోయారు.రెండు రోజులుగా సంజయ్ కుమార్ ప్రముఖులను కలిసినట్టు చెబుతున్నారు. దీంతో ఆయనను కలిసినవారంతా ఆందోళనకు గురవుతున్నారు. కరోనా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తనను కలిసిన వారు విధిగా పరీక్ష చేయించుకోవాలని అలానే వారంతా హోమ్ క్వారన్ టైన్ లో ఉండాలని సంజయ్ కుమార్ సూచించారు. గతంలో కరోనా సోకిన పేషెంట్‌కు ఎమ్మెల్యే చికిత్స కూడా చేసి వార్తల్లో నిలిచారు.

Tags :
|
|

Advertisement