Advertisement

  • పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను అప్పటివరకు ఆపండి ...అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను అప్పటివరకు ఆపండి ...అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

By: Sankar Sat, 26 Dec 2020 2:45 PM

పీసీసీ చీఫ్ ఎన్నిక ప్రక్రియను అప్పటివరకు ఆపండి ...అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ


తెలంగాణ పీసీసీ పదవీపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో పీసీసీ పదవీపై సోనియా గాంధీ, రాహుల్, ఇన్ చార్జ్ ఠాగూర్ కి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు.

పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని... నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అధిష్టానం ఎవరినైతే పీసీసీ చేయాలని అనుకుంటుందో... దానిపై సీనియర్ నాయకులతో ఏకాభిప్రాయం తీసుకోవాలని కోరారు జగ్గారెడ్డి. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొన్నారు..

ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి, మార్చిలో రానున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు జాగ్రత్త పడాల్సిన అవసరముందని పేర్కొంటూ.. జానారెడ్డి నాయకత్వంలోనే ముందుకు వెళ్లాలని లేఖలో ఆయన సూచించారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్నారు. సీనియర్ నాయకుల్లో ఏకాభిప్రాయం వచ్చే వరకు పీసీసీ చీఫ్‌ ఎన్నిక ప్రక్రియ ఆపాలని కోరారు.

Tags :
|
|

Advertisement